కృష్ణా జిల్లాలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ప్రేమ వ్యవహారమే కారణం?

-

ఏపీలోని కృష్ణా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన జిల్లాలోని పెనమలూరు నియోజకవర్గం కానూరు ఎన్​ఆర్​ఐ కాలేజీలో మంగళవారం ఉదయం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. తోట్లవల్లూరు మండలం గురువిందపల్లి గ్రామానికి చెందిన గుర్రం వేణునాథ్(18) ఎన్ఆర్ఐ కాలేజీలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.

నేడు హాస్టల్​ గదిలో ఫ్యాన్​‌కు ఉరేసుకుని కనిపించడంతో తోటి విద్యార్థుల సమాచారంతో కాలేజీ యాజమాన్యం మృతుడి పేరెంట్స్‌కు సమాచారం అందించింది. చేతికొచ్చిన కొడుకును విగతజీవిగా చూసిన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. ప్రేమ వ్యవహారమే వేణునాథ్​ ఆత్మహత్యకు కారణమని ఎన్ఆర్ఐ సిబ్బంది చెబుతున్నారు.దానికి సంబంధించి సూసైడ్ నోట్ దొరికిందని వెల్లడించారు. అయితే, ఆ నోట్‌లోని హ్యాండ్ రైటింగ్ తమ కొడుకుది కాదని వేణునాథ్​ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.తమ కొడుకు మరణంపై అనుమానాలు ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news