బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్ మార్కెట్ యార్డులోని రైతులతో కలిసి ముచ్చటించారు.శనివారం ఉదయం ఆమె తన అనుచరులతో కలిసి మార్కెట్ యార్డుకు వెళ్లారు. అనంతరం అక్కడ పసుపు రైతులతో కలిసి పసుపు కొనుగోళ్లు జరుగుతున్న తీరును పరిశీలించారు.
పసుపు బోర్డు వచ్చి కూడా మాకు లాభం లేకుండా పోయిందని రైతులు కవితతో తమ గోడును చెప్పుకున్నారు. మంచి క్వాలిటీ ఉన్న పసుపు పంటకు కూడా రేటు రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఈ విషయంపై రైతుల పక్షాన పోరాడుతామని పసుపు రైతులకు కవిత భరోసా ఇచ్చినట్లు సమాచారం.
నిజామాబాద్ మార్కెట్ యార్డ్ లో పసుపు రైతులతో కలిసి పసుపు కొనుగోళ్లను పరిశీలిస్తున్న ఎమ్మెల్సీ కవితక్క
పసుపు బోర్డు వచ్చి కూడా మాకు లాభం లేకుండా పోయిందని వాపోతున్న పసుపు రైతులు. pic.twitter.com/r8XzGwlS2a
— 𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨 (@Nallabalu1) February 22, 2025