గురుకుల అర్హత పరీక్షలో బాలుడి మారం.. ధైర్యం చెప్పి పంపిన పోలీసులు

-

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలకు సంబంధించి 6వ తరగతి నుంచి 9వ తరగతుల్లో ప్రవేశాలకు ఆదివారం పరీక్ష నిర్వహించారు. అయితే, అర్హత పరీక్ష రాసేందుకు పలివేల్పుల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సీ పాఠశాల పరీక్ష కేంద్రానికి తండ్రితో వచ్చిన ఓ విద్యార్థి లోనికి వెళ్లనని, నాకు భయం వేస్తోందని మారం చేశాడు.

దీంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న కేయూసి ఇన్‌స్పెక్టర్ రవికుమార్, హన్మకొండ ఏసీపీ దేవేందర్ రెడ్డి ఆ విద్యార్థిని బుజ్జగించి ధైర్యం చెప్పి పరీక్షా కేంద్రంలోకి పంపించారు. సదరు విద్యార్థి పరీక్ష రాసేందుకు పోలీసులు చూపిన చోరవను పలువురు మెచ్చుకుంటున్నారు.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news