ఉత్తరాఖండ్‌లో విరిగిపడిన మంచు కొండలు.. 57మంది గల్లంతు

-

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఛమోలీ జిల్లాలో మంచు కొండలు విరిగిపడ్డాయి.ఈ ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఛమోలీ – బద్రీనాథ్ నేషనల్ హైవే రోడ్డు నిర్మాణం పనులు చేపడుతున్న కార్మికులపై ఒక్కసారిగా మంచు కొండ చరియలు విరిగిపడ్డాయి.

ఈ ప్రమాదంలో 57 మంది గల్లంతవ్వగా 49 మందిని రెస్క్యూ సిబ్బంది రక్షించినట్లు తెలుస్తోంది. అయితే, ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండటంతో ఎయిర్ లిఫ్ట్ చేసి ఆసుపత్రికి తరలించారు.గల్లంతైన మరో 8 మంది కార్మికుల కోసం ప్రస్తుతం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కాగా,ఈ ఘటన జరిగిన 24 గంటల్లోనే 49 మందిని రెస్క్యూ టీమ్ కాపాడినట్లు అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news