ఇవాళ లక్ష మంది మహిళలతో పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ సభ

-

నేడు మరో భారీ బహిరంగ సభకు సీఎం రేవంత్‌ రెడ్డి సిద్ధం అయ్యారు. లక్ష మంది మహిళలతో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ సభ నిర్వహించనున్నాను. ఇందిరా మహిళా శక్తి మిషన్-2025ను ఆవిష్కరించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మహిళా సంఘ సభ్యులకు లోన్ బీమా, ప్రమాద బీమా చెక్కులు అందజేయనున్నారు సీఎం రేవంత్‌ రెడ్డి.

Huge gathering at Secunderabad Parade Grounds with one lakh women

మహిళా సంఘాల ఆధ్వర్యంలో నడిచే 150 అద్దె బస్సులను ప్రారంభించనున్నారు సీఎం రేవంత్. ఇక ఈ సభ పూర్తి కాగానే.. ఢిల్లీ వెళతారు సీఎం రేవంత్‌ రెడ్డి. దీంతో 39వ సారి ఢిల్లీకి వెళ్తున్నారు రేవంత్ రెడ్డి. ఈ తరుణంలోనే… హైదారాబాద్ టూ ఢిల్లీ అప్ & డౌన్ చేస్తున్నారని రేవంత్ రెడ్డి పై సెటైర్లు పేల్చుతున్నారు బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు. నిన్న రాత్రే హైదారాబాద్‌కు వచ్చి మళ్ళీ ఈరోజు రాత్రి ఢిల్లీకి వెళ్లనున్నారు రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news