నేడు మరో భారీ బహిరంగ సభకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధం అయ్యారు. లక్ష మంది మహిళలతో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో భారీ సభ నిర్వహించనున్నాను. ఇందిరా మహిళా శక్తి మిషన్-2025ను ఆవిష్కరించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మహిళా సంఘ సభ్యులకు లోన్ బీమా, ప్రమాద బీమా చెక్కులు అందజేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి.

మహిళా సంఘాల ఆధ్వర్యంలో నడిచే 150 అద్దె బస్సులను ప్రారంభించనున్నారు సీఎం రేవంత్. ఇక ఈ సభ పూర్తి కాగానే.. ఢిల్లీ వెళతారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో 39వ సారి ఢిల్లీకి వెళ్తున్నారు రేవంత్ రెడ్డి. ఈ తరుణంలోనే… హైదారాబాద్ టూ ఢిల్లీ అప్ & డౌన్ చేస్తున్నారని రేవంత్ రెడ్డి పై సెటైర్లు పేల్చుతున్నారు బీఆర్ఎస్ పార్టీ నేతలు. నిన్న రాత్రే హైదారాబాద్కు వచ్చి మళ్ళీ ఈరోజు రాత్రి ఢిల్లీకి వెళ్లనున్నారు రేవంత్ రెడ్డి.