కొత్త రేషన్ కార్డుల జారీపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన.. 3 రంగుల్లో డిజిటల్ కార్డ్స్

-

కొత్త రేషన్ కార్డుల జారీపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఉగాది తర్వాత ఏప్రిల్ మొదటి వారం నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఉండొచ్చని ఆ శాఖ మంత్రి వెల్లడించారు. అయితే, కార్డుల జారీలో కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుందన్నారు. రెండు కేటగిరీలుగా డివైడ్ చేసి కార్డులు పంపిణీ చేస్తామన్నారు.

దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికీ (బీపీఎల్) కార్డులు, ఎగువన ఉన్న వారికి (ఏపీఎల్) కార్డులు ఇవ్వాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈ విషయంలో ఎవరికి ఎలాంటి అపొహలు అవసరం లేదన్నారు. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తామని స్పష్టంచేశారు. ఇప్పటికే పింక్ కార్డులు ఉన్న వారికి గ్రీన్ కలర్ కార్డులు, తెల్ల కార్డులు ఉన్న వారికి ట్రై కలర్ కార్డులు ఇస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news