రెండో రోజు కొనసాగుతున్న ఐటీ దాడులు

-

 

ఆంధ్రప్రదేశ్లో  రెండో రోజు ఐటీ దాడులు కొనసాగుతున్నాయి.  పలు రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు, రాజకీయ నేతల ఇళ్లును ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. శుభగృహ దాని అనుబంధ సంస్థలే టార్గెట్‌గా అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. మాచవరంలోని శుభగృహ సంస్థకి చెందిన నివాసాల్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.  కక్షసాధింపు చర్యల్లో భాగంగానే తనిఖీలు చేపడుతున్నట్లు ఇప్పటికే ఏపీలో సర్వత్రా చర్చనీయాంశమైంది. విజయవాడ, గుంటూరు, నెల్లూరు, విశాఖ పట్నంలోని తెదేపా నేతలకు సంబంధించిన వ్యాపార సంస్థల్లో ఐటీ తనిఖీలను రెండో రోజు కొనసాగించాడన్ని పలువురు తీవ్రంగా ఖండిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news