ఏపీలో ఈ నెల 10న డీఎస్సీ నోటిఫికేషన్

-

నవంబర్ 30న పరీక్ష

ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 10 డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు తెలిపారు. శుక్రవారం సాయంత్రం వెలగపూడి సచివాలయలో సంబంధిత అధికారులతో సమావేశమైన ఆయన డీఎస్సీ నోటిఫికేషన్ పై నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ… ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ఏపీపీఎస్సీ ద్వారా కాకుండా డీఎస్సీ ద్వారా నిర్వహించనున్నామన్నారు. టెట్‌ కమ్‌ టీఆర్టీ విధానంలో ఉపాధ్యాయుల ఎంపిక కొనసాగుతుందన్నారు. ఈ నెల 10 నోటిఫికేష్, నవంబర్ 30న పరీక్షను సైతం నిర్వహించి జనవరి 3న ఫలితాలు ప్రకటిస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 10,354 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ ప్రభుత్వం 6100 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చినట్లు వివరించారు. జాతీయ విద్యా సంస్థలు మంజూరు, వాటి నిర్వహణ పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వం తరుఫున మంత్రి గంటా ఓ శ్వేతపత్రాన్ని విడుదల చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news