అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట, రాయపర్తి, పర్వతగిరి, సంగెం, ఐనవోలు మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది.కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయిన కారణంగా.. ప్రభుత్వం కేవలం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి చేతులు దులుపుకున్నదని.. అధికార యంత్రాంగం పట్టించుకోవడం అన్నదాతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
ఇప్పటికీ చాలా చోట్ల దొడ్డు రకం వడ్లకు మిల్లులను ప్రభుత్వం కేటాయించలేదని రైతులు ఆరోపిస్తున్నారు. కాంటాలు అవుతున్నా మిల్లులకు ధాన్యం ఎగుమతి కావడం లేదని అంటున్నారు.ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడం, దీనికి తోడు అకాల వర్షాల కారణంగా బిక్కుబిక్కుమంటూ రైతన్నలు కాలం వెళ్లదీస్తున్నారు.