ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని ఓ యువకుడు రైలు కింద పడ్డాడు. ఏడు సంవత్సరాలుగా ప్రేమించిన అమ్మాయి మోసం చేసి వేరే పెళ్లి చేసుకుందని..సెల్ఫీ వీడియో తీసి రైలు కింద పడి యువకుడి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.వివరాల్లోకివెళితే.. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం లక్ష్మణపల్లి గ్రామానికి చెందిన దార ఎల్లేష్ అనే యువకుడితో వరలక్ష్మి అనే యువతి ఏడేళ్ల నుండి ప్రేమ వ్యవహారం నడిపించినట్లు సమాచారం.
ఇటీవల ఆ యువతి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందని, మనస్తాపం చెందిన సదరు యువకుడు.. సెల్ఫీ వీడియో తీసుకోని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఫోన్ లో కాల్ రికార్డింగ్స్ అన్ని ఉన్నాయని.. యువతి వచ్చే వరకు తన శవాన్ని తీయవద్దని, యువతి కుటుంబంపై చర్య తీసుకోవాలని చనిపోయే ముందు తల్లిదండ్రులను ఎల్లేష్ కోరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని రైలు కింద పడ్డ యువకుడు
7 ఏళ్ళు ప్రేమించిన అమ్మాయి మోసం చేసి వేరే పెళ్లి చేసుకుందని.. సెల్ఫీ వీడియో తీసి రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య
కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం లక్ష్మణపల్లి గ్రామానికి చెందిన దార ఎల్లేష్ అనే యువకుడితో ఏడేళ్ల నుండి ప్రేమ… pic.twitter.com/lx0DPxyUEd
— Telugu Scribe (@TeluguScribe) May 8, 2025