భారత్ లోని 15 నగరాల్లో దాడులకు పాక్ యత్నం..!

-

భారత్ లోని 15 నగరాల్లోని మిలటరీ స్థావరాలపై పాకిస్తాన్ దాడులు చేసేందుకు ప్రయత్నించి విఫలం చెందిందని జాతీయ మీడియా పేర్కొంది. చైనా కు చెందిన బీవీఆర్ మిస్సైల్ తో దాడులు చేసేందుకు యత్నించగా.. భారత్ లోని S400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ సమర్థంగా అడ్డుకుంది. జమ్మూ, శ్రీనగర్, అమృత్ సర్, పఠాన్ కోట్, బటిండా, లుథియానా, జలంధర్, చండీఘడ్, అవంతిపుర, భుజ్, ఫలోడీ పాటు పలు నగరాలపై దాడులకు పాక్ యత్నించింది. 

దీంతో పాక్ స్టాక్ ఒక్కసారిగా కుప్ప కూలాయి. మరోవైపు పాకిస్తాన్ చేస్తున్న దాడులను మాత్రం భారత భద్రతా దళాలు తిప్పి కొడుకుతున్నాయి. పాకిస్తాన్ మిస్సైళ్లను గాల్లోనే పేల్చిసింది భారత్. S-400 మిస్సైల్ ని ఉపయోగించి భారత్ పాకిస్తాన్ మిస్సైల్ ని కూల్చేసింది. ధర్మశాలలో జరిగే ఐపీఎల్ మ్యాచ్ వేదిక మార్చారు. మ్యాచ్ వేదిక అహ్మదాబాద్ కి మార్చింది బీసీసీఐ.

Read more RELATED
Recommended to you

Latest news