పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పరార్ అయ్యాడు. ఇస్లామాబాద్ లోని పాక్ ప్రధాని నివాసానికి అతి సమీపంలో భారత్ మిస్సైల్ అటాక్ చేసింది. సురక్షిత ప్రాంతానికి షెహబాజ్ తరలించారు. కుటుంబంతో సహా ప్రత్యేక విమానంలో విదేశాలకు పారిపోయినట్లు సమాచారం అందుతోంది. అజ్ఞాతంలోకి పాక్ ప్రధానితో పాటు ఆర్మీ చీఫ్ వెళ్ళాడు.

ఇది ఇలా ఉండగా చండీగఢ్ లో హై అలెర్ట్. చండీగఢ్ మీద పాకిస్తాన్ దాడి చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఈ తరుణంలోనే ఎయిర్ సైరెన్స్ మోగాయి. దింతో చండీగఢ్ లో జనాలు వణికిపోతున్నారు. చండీగఢ్ ప్రజలు అందరూ ఇంట్లోనే ఉండాలి అని ఆదేశాలు జారీ చేశారు అధికారులు.
కాగా ‘ఆపరేషన్ సింధూర్’ తర్వాత భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. నియంత్రణ రేఖ వెంబడి దాయాది సైన్యం కాల్పులు జరుపుతోంది. వీటిని భారత ఆర్మీ సమర్థంగా తిప్పికొడుతోంది. ఈ క్రమంలోనే భారత సైన్యం నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పాక్ ఆర్మీ శిబిరాన్ని పూర్తిగా ధ్వంసం చేసింది. దానికి సంబంధించిన వీడియోను సైతం భారత సైన్యం విడుదల చేసింది.