నేటి నుంచి సరస్వతి పుష్కరాలు ప్రారంభం అయ్యాయి. కాళేశ్వరం క్షేత్రంలోని త్రివేణి సంగమంలో ఇవాళ్టి నుంచి సరస్వతి నది పుష్కరాలు ప్రారంభం అయ్యాయి. ఈ నెల 26 వరకు సరస్వతి పుష్కరాలు జరగనున్నాయి. ఇందు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇవాళ సాయంత్రం కాళేశ్వరం వెళ్లనున్నారు సీఎం రేవంత్ దంపతులు. 10 అడుగుల సరస్వతిదేవి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు సీఎం రేవంత్.

ఇక నేటి నుంచి మే 26 వ తేది వరకు అంటే 11 రోజులు జరుగుతాయి సరస్వతి పుష్కరాలు.ఈ మేరకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇవాళ సాయంత్రం రేవంత్ రెడ్డి దంపతులు రానున్నారు. ఇదిలా ఉండగా, కటౌట్లో రేవంత్ రెడ్డి కాళ్ళ దగ్గర సరస్వతి దేవి పోటో పెట్టి అవమానం చేసారని గులాబీ పార్టీ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కటౌట్లో రేవంత్ రెడ్డి దంపతులు, కాంగ్రెస్ మంత్రుల కాళ్ళ దగ్గర చదువుల తల్లి సరస్వతి దేవి ఫోటో పెట్టారని గులాబీ పార్టీ నేతలు ఫైర్ అవుతున్నారు.