అత్యంత ఆశ్చర్యకర పరిశోధన: రైళ్లలో కింగ్ కోబ్రాల ప్రయాణం నిజమా?

-

అడవికి రారాజు అనగానే మనకు సింహం గుర్తొస్తుంది, కానీ పాములలో రారాజు అంటే అది ఖచ్చితంగా ‘కింగ్ కోబ్రానే’. పశ్చిమ కనుమలలోని దట్టమైన అడవుల్లో గంభీరంగా తిరిగే ఈ విష సర్పాలు ఇప్పుడు వింతగా ‘రైలు ప్రయాణాలు’ చేస్తున్నాయనే వార్త కలకలం రేపుతోంది. వినడానికి సినిమా కథలా ఉన్నా ప్రముఖ రీసర్చర్ దికాన్ష్ పర్మార్ చేసిన పరిశోధనలో ఆశ్చర్యకరమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి. అడవి వదిలి ఈ పాములు పట్టాలెందుకు ఎక్కుతున్నాయి? రైలు పెట్టెల్లోకి ఎలా చేరుతున్నాయి? ఈ ఉత్కంఠభరిత అంశాలను ఇప్పుడు చూద్దాం.

కింగ్ కోబ్రాలు రైళ్లలో ప్రయాణిస్తున్నాయా? : సాధారణంగా కింగ్ కోబ్రాలు మనుషుల వాసన తగిలితేనే ఆమడ దూరం పారిపోతాయి. అడవిలోని ప్రశాంతమైన వాతావరణం సమృద్ధిగా దొరికే ఆహారం (ఇతర పాములు) వాటికి ప్రాణం. కానీ ఇటీవలి కాలంలో అడవికి దూరంగా, ఊహించని ప్రాంతాల్లో ఈ పాములు ప్రత్యక్షమవుతున్నాయి. దీనిపై సూరత్‌కు చెందిన హెర్పెటాలజిస్ట్ దికాన్ష్ పర్మార్ లోతైన అధ్యయనం చేశారు.

అడవి నుంచి పట్టాల వరకు: గోవా, కర్ణాటక వంటి ప్రాంతాలకు వెళ్లే రైల్వే లైన్లు పశ్చిమ కనుమలలోని అత్యంత దట్టమైన అరణ్యాల గుండా ప్రయాణిస్తాయి. అడవి మధ్యలో రైళ్లు ఆగినప్పుడు లేదా స్టేషన్ల వద్ద నిలిచినప్పుడు, కింగ్ కోబ్రాలు ఆహారం వేటలోనో లేదా చల్లని ఆశ్రయం కోసమో అటువైపు వస్తున్నాయి. రైలు చక్రాల సందుల్లోనో ఇంజిన్ భాగాల్లోనో లేదా లగేజీ బోగీల్లోనో ఇవి తెలియకుండానే దూరిపోతున్నాయి.

Shocking Study: Do King Cobras Really Travel in Trains?
Shocking Study: Do King Cobras Really Travel in Trains?

రైలు ప్రయాణమే శాపమా?: ఒకసారి రైలు కదిలిందంటే, ఆ పాము కూడా కిలోమీటర్ల దూరం ప్రయాణించి కొత్త ప్రాంతానికి చేరుకుంటోంది. అడవి వాతావరణానికి అలవాటు పడిన కింగ్ కోబ్రా, ఒక్కసారిగా కాంక్రీట్ అడవుల్లోకి లేదా తక్కువ తేమ ఉన్న ప్రాంతాలకు చేరుకున్నప్పుడు తీవ్ర ఇబ్బందులు పడుతోంది. అక్కడ దానికి సరైన ఆహారం దొరకదు, మనుషుల వల్ల ప్రాణహాని కూడా ఎక్కువే. అంటే, అది చేసే ఈ ప్రయాణం దానికి ఒక తెలియని ప్రమాదం అన్నమాట.

పరిశోధన హెచ్చరిక: ప్రకృతిని మనం ఎంతలా ఆక్రమిస్తున్నామో చెప్పడానికి ఇదొక నిదర్శనం. అడవుల గుండా రైలు మార్గాలు వేసినప్పుడు, వన్యప్రాణుల కదలికలపై అది ఎలాంటి ప్రభావం చూపుతుందో ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది. కింగ్ కోబ్రాలు రైలు ఎక్కుతున్నాయి అంటే, అవి తమ సహజ ఆవాసాలను కోల్పోతున్నాయని లేదా వాటి మనుగడ గందరగోళంలో పడిందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news