ఏపీ కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్.. హాల్ టికెట్లపై కీలక ప్రకటన వచ్చేసింది. ఏపీలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించనున్న తుది రాత పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను అభ్యర్థులు ఈ సా. 5 గంటల నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను https://slprb.ap.gov.in/ ఈ వెబ్ సైట్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

జూన్ 1న ఉ. 10 గంటల నుంచి మ. 1 గంట వరకు తుది రాత పరీక్ష జరగనుంది. ఈ పరీక్షలో మొత్తం 38,910 మంది అభ్యర్థులు హాజరవుతారని అధికారులు తెలిపారు. ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి ఈ నెల 31వ తేదీ వరకు మాత్రమే హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని పిఆర్బి చైర్మన్ అధికారిక ప్రకటన చేశారు.