అయోధ్యలో మద్యం, మాంసం పైన నిషేధానికి అయోధ్యలోని అధికారులు చర్యలు చేపడుతున్నారు. భక్తుల నుంచి మాంసం, మద్యం అమ్మకాలపై అనేక రకాల ఫిర్యాదులు రావడంతో రామ్ పథ్, ధర్మ 14 కోసి మార్గ్ లాంటి రహదారులలో మాంసం, మద్యం అమ్మకాలపై నిషేధం విధించాలని నిర్ణయం తీసుకున్నారు. మాంసం, మద్యం దుకాణాలను వేరే చోటుకు మార్చుకోవాలని అయోధ్య అధికారులు షాప్ యజమానులను ఆదేశించారు.

అలాగే అయోధ్యలోని పలు ప్రాంతాలలో మద్యంపై కూడా నిషేధం అమలు చేయనున్నట్లు మేయర్ త్రిపాటి పేర్కొన్నారు. వేసవికాలం సెలవుల కారణంగా అయోధ్య రామ మందిరం ఆలయానికి విపరీతంగా భక్తులు పోటెత్తుతున్నారు. రామ మందిర దర్శనం కోసం పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. ఈ క్రమంలోనే అయోధ్య రామ మందిరం గుడి రహదారిలో మద్యం, మాంసం అమ్మకాలను చూసి భక్తులు నిషేధం విధించాలని అధికారులు కోరుతున్నారు. భక్తుల కోరిక మేరకు వెంటనే అధికారులు స్పందించి నిషేధం విధించారు. దీనిపైన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.