డీఎస్సీ పరీక్షలు రాసేవారికి బిగ్ అలర్ట్.. ఈ రూల్స్ ఇవే

-

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డీఎస్సీ పరీక్షలు రాసేవారికి బిగ్ అలర్ట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎల్లుండి నుంచి డీఎస్సీ పరీక్షలు జరగనున్నాయి. ఇందులో 16, 347 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో చాలామంది డిఎస్సీ పరీక్షలు రాయడానికి అప్లై చేసుకున్నారు. కాగా డీఎస్సీ పరీక్ష ఎల్లుండి నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షలు రాసే వారి అభ్యర్థుల హాల్ టికెట్ల పైన ఫోటోలు లేకపోయినప్పటికీ ప్రస్తుతం ఉన్న ఫోటోను వారి ఐడిని పరిశీలించి పరీక్షలకు అనుమతించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.

Big alert for those appearing for DSC exams in Andhra Pradesh state
Big alert for those appearing for DSC exams in Andhra Pradesh state
AP DSC 2024 Free Coaching

నామినల్ రోల్స్ లో తప్పుల సవరణకు సెంటర్ వద్ద అనుమతి ఇవ్వాలని చెప్పారు. కాగా కంటిచూపు సరిగ్గా లేనివారికి, రెండు చేతులు లేని వారికి ఆదనంగా మరో 50 నిమిషాల పాటు పరీక్ష రాసేందుకు సమయం ఇవ్వాలని స్పష్టం చేశారు. దరఖాస్తులో హెల్పర్ పేరు లేకున్నా అక్కడికక్కడే ఏర్పాటు చేయాలని చెప్పారు. డీఎస్సీ పరీక్షలు రాసేవారు సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని వెల్లడించారు. దీంతో డీఎస్సీ పరీక్షలు రాసే అభ్యర్థులు అలర్ట్ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news