తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర విషాదం నెలకొంది. మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి మృతి చెందారు. తాజాగా ఆయనకు గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇవాళ ఉదయం గుండెపోటుతో తుది శ్వాస విడిచారని కుటుంబ సభ్యులు అధికారిక ప్రకటన చేశారు. ఇవాళ షామీర్పేట లో రంగారెడ్డి అంతక్రియలు కూడా నిర్వహించబోతున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఆయన సన్నిహితులుగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకసారి ఎమ్మెల్సీగా ఆయన ఎన్నికయ్యారు. ఇక రంగారెడ్డి మృతి నేపథ్యంలో రాజకీయ నాయకులు అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సంతాపం తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి గారి మరణం బాధాకరం అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ… వారి కుటుంబ సభ్యులకు…నా ప్రగాఢ సానుభూతి అని పేర్కొన్నారు.