విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధికి రూ. 850 కోట్లు.. కేంద్రం బంపర్ ఆఫర్

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో రైల్వే స్టేషన్ అభివృద్ధికి నీతి అయోగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విజయవాడలో రైల్వే స్టేషన్ ను ఆధునికరించేందుకు రూ. 850 కోట్ల రూపాయలను ప్రకటించింది. విజయవాడ రైల్వే స్టేషన్ ను 850 కోట్ల రూపాయలతో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్ షిప్ విధానంలో ఆధునీకరించేందుకు నీతి అయోగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం అందుతోంది.

850 crore for the development of Vijayawada Railway Station
850 crore for the development of Vijayawada Railway Station

ప్రస్తుతం 12,538 చదరపు మీటర్లలో ఉన్న రైల్వే స్టేషన్ ను 1. 54 లక్షల చదరపు కిలోమీటర్లకు పెంచడానికి నిర్ణయం తీసుకున్నారు. 84,000 చదరపు మీటర్లలో స్టేషన్, 70,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో వాణిజ్య భవన సముదాయాలు ఉండబోతున్నాయి. రాబోయే 30 ఏళ్లలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేయాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. రోజురోజుకీ ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరుగుతోంది. రైల్వే స్టేషన్ లో ప్రజలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ప్రయాణికులు సంతోషంలో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news