లోన్లు తీసుకున్న వారికి గుడ్ న్యూస్ చెప్పింది RBI. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రజలకు శుభవార్త అందజేసింది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా స్పష్టం చేసింది. వరుసగా మూడోసారి రెపో రేట్ తగ్గించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. 50 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ ప్రణాళికలు జారీ చేసింది. రేపో రేట్ 6% నుంచి 5.5 శాతానికి చేరుకుంది.

ఈ తగ్గింపుతో హోమ్ లోన్స్, వాహన లోన్స్, పర్సనల్ లోన్స్, ఈఎంఐలు పూర్తిగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, ఇదివరకే రెండుసార్లు 25 పాయింట్ల మేర కోత విధించిన రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా సంస్థ ఒకేసారి 50 బేసిస్ పాయింట్లు తగ్గించడం విశేషం. దీంతో ప్రతి ఒక్కరూ సంతోషంలో ఉన్నారు. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న ఈ నిర్ణయానికి కృతజ్ఞతలు చెబుతున్నారు.