బిజెపి ఎంపీ ఈటల రాజేందర్ కాళేశ్వరం కమిషన్ విచారణకు తాజాగా హాజరయ్యారు. హైదరాబాద్ లోని బిఆర్కే భవన్ లో జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుంది. అంతకు ముందుగానే ఈటెల రాజేందర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. రాజకీయ లబ్ధి కోసమే కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని ఆయన అన్నారు. కాళేశ్వరం అక్రమాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఆర్థిక మంత్రిగా ఆ రోజు కేవలం డబ్బు కేటాయించడమే తన పని అని స్పష్టం చేశారు.

సుమారు గంట పాటు ఈటల రాజేందర్ ను కమిషన్ ప్రశ్నించింది. ఈటల రాజేందర్ కమిషన్ పలు డాక్యుమెంట్లను సమర్పించారు. గత ప్రభుత్వ క్యాబినెట్ ఆదేశాలతోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిధులను విడుదల చేసినట్టుగా ఆయన వెల్లడించారు. సొంతంగా తాను ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని సాంకేతిక అంశాల గురించి అతనికి తెలియదని ఈటెల రాజేందర్ అన్నారు. ప్రస్తుతం ఈటెల రాజేందర్ మాట్లాడిన ఈ మాటలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.