ఇవాళ, రేపు హైదరాబాద్ లో చేప మందు పంపిణీ

-

తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్. నేటి నుంచి చేప మందు పంపిణీ జరుగనుంది. రెండు రోజుల పాటు చేప మందు పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేసింది తెలంగాణ రాష్ట్ర సర్కార్. ఇవాళ, రేపు చేప మందు పంపిణీ జరుగనుంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఉ.9 గంటల నుంచి చేప మందు ప్రసాదం చేసేందుకు 32 కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు.

Chepa Prasadam
Fish medicine distribution in Hyderabad today and tomorrow

మృగశిర కార్తె సందర్భంగా ఉబ్బసం వ్యాధిగ్రస్తుల కోసం ప్రతి ఏటా చేప మందు ప్రసాదాన్ని పంపిణీ చేస్తోంది బత్తిన కుటుంబం. చేప మందు కోసం వచ్చే ఆస్తమా రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news