ఏఐజి ఆసుపత్రికి చేరుకున్న హరీష్ రావు

-

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి చెందారన్న విషయం తెలియగానే హుటాహుటిన గచ్చిబౌలి ఏఐజి ఆసుపత్రికి చేరుకున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతి చెందారు. తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్.

harish rao
harish rao

గుండెపోటుతో ఈ నెల 5న గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు మాగంటి గోపినాథ్.  ఇక దీనిపై హరీష్ రావు స్పందించారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గారి అకాల మరణం అత్యంత బాధాకరం అన్నారు. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. వారి మృతి బి ఆర్ ఎస్ పార్టీకి తీరని లోటు అన్నారు. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిన వారి జీవితం ఆదర్శం. గోపినాథ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను అని వెల్లడించారు హరీష్ రావు.

 

Read more RELATED
Recommended to you

Latest news