ఫుడ్ పాయిజన్ జరగకుండా ఉండాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

-

ఈ మధ్యకాలంలో ఆహారం ఎంతో కలుషితమైంది అనే చెప్పవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలన్న వాటి నాణ్యత తగ్గిపోవడంతో అందరూ భయపడుతున్నారు. ముఖ్యంగా కలుషితమైన ఆహారాన్ని తీసుకోవడం వలన ఫుడ్ పాయిజన్ కు గురవుతున్నారు. దీంతో పూర్తి ఆరోగ్యం దెబ్బతింటుంది. పైగా, కొన్ని రకాల ఆహార పదార్థాలు ఎంతో త్వరగా ఫుడ్ పాయిజన్ కు గురిచేస్తాయి. కనుక, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే తగిన జాగ్రత్తలను తీసుకోవడం ఎంతో అవసరం. ఈ మధ్యకాలంలో సమయం లేకపోవడం వలన చిరుతిండ్లను ఎక్కువగా తీసుకుంటున్నారు. వాటి వలన అనారోగ్యానికి గురవ్వాల్సి వస్తుంది.

పైగా, కలుషిత ఆహారాన్ని తీసుకోవడం వలన ఫుడ్ పాయిజన్ కూడా అవుతోంది. ఆహారం కాలుష్యమైనప్పుడు, దానిలో హానికరమైన బ్యాక్టీరియా ఉంటుంది. ఇది పొట్టలోకి చేరిన తర్వాత, బ్యాక్టీరియా కారణంగా రియాక్షన్స్ వస్తాయి. దీంతో ఫుడ్ పాయిజన్ ను ఎదుర్కొవాల్సి వస్తుంది. ఆహారంలో ఉండే టాక్సిన్స్ వలన ఫుడ్ పాయిసనింగ్ అవుతుంది. కనుక, కలుషితమైన ఆహారాన్ని తీసుకున్నప్పుడు రియాక్షన్ ఎంతో త్వరగా వస్తుంది అని గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా నాన్ వెజ్ ఎంతో త్వరగా కలుషితం అవుతుంది మరియు బ్యాక్టీరియా కూడా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా కస్టర్డ్స్, డెజర్ట్స్ వంటి వాటిలో కూడా ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గర్భిణీ స్త్రీలు ఆహారం తీసుకునే విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి.

వీరు నిర్లక్ష్యం చేస్తే ప్రాణానికే ప్రమాదం అని నిపుణులు చెప్తున్నారు. ఫుడ్ పాయిజనింగ్ అవ్వకుండా జాగ్రత్త వహించాలంటే కూరగాయలు, పండ్లు శుభ్రంగా కడిగిన తర్వాతే తీసుకోవాలి. అంతేకాకుండా, సరైన టెంపరేచర్ లో ఆహార పదార్థాలను నిల్వ చేయాలి. ఆహార పదార్థాలను ఎక్కువగా నిల్వ చేయడం వలన ఫుడ్ పాయిజనింగ్ ఎక్కువగా జరుగుతుంది. వీటితో పాటుగా, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల ఎక్స్పైరీ డేట్ ను కూడా గమనించి ఉపయోగించాలి మరియు పగిలిపోయిన గుడ్లను తీసుకోకూడదు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఫుడ్ పాయిసనింగ్ అవ్వకుండా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news