మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. సోదరుడు, మృదు స్వభావి, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు ఈరోజు ఉదయం మృతి చెందడం చాలా బాధాకరమని తెలిపారు.. మంచి నాయకుడిని కోల్పోయామని వెల్లడించారు.

కుటుంబసభ్యుల ఆలోచన మేరకు మహాప్రస్థానంలో ఇవాళ సాయంత్రం 3 గంటల నుండి 4 గంటల మధ్య అంత్యక్రియలు జరగనున్నాయన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గోపీనాథ్ ఇంటి నుండి ర్యాలీగా అంతిమ యాత్ర ప్రారంభం అవుతుంది.. అందరు సహకరించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నందుకు ధన్యవాదాలు చెప్పారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.