హనీమూన్ జంట అదృశ్యం కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. హనీమూన్ జంట అదృశ్యం కేసులో భర్తను భార్యే చంపించింది. హనీమూన్కు వెళ్లి దారుణ హత్యకు గురైయ్యాడు రాజా రఘువంశీ. అటు రఘువంశీ కుటుంబం మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇందౌర్లో ట్రాన్స్పోర్ట్ వ్యాపారం చేస్తున్నారు. గత నెల మే 11న రఘువంశీతో సోనమ్ వివాహం జరగగా.. 20న హనీమూన్ కోసం మేఘాలయ వెళ్ళింది జంట.

ఈ క్రమంలోనే ఉన్నట్లుండి నవ దంపతులు అదృశ్యం అయ్యారు. 11 రోజుల అనంతరం సోహ్రాలోని ఓ జలపాతం సమీపంలోని లోయలో రఘువంశీ మృతదేహం లభ్యం అయింది. రఘువంశీ శరీరంపై కత్తి పోట్లు ఉండడంతో హత్యగా అనుమానం వ్యక్తం చేశారు పోలీసులు.. భార్య ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేసారు. కనిపించకుండా పోయి తాజాగా ఉత్తరపదేశ్-గాజీపూర్లో పోలీసుల ఎదుట హత్య తానే చేయించినట్లు లొంగిపోయింది సోనమ్. ఈ కేసులో రఘువంశీ భార్య సోనమ్ సహా నలుగురిని అరెస్టు చేశారు పోలీసులు.