ఏపీలోని మహిళలకు శుభవార్త అందజేసింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. కొత్తగా పింఛన్లు ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంది. ఏకంగా ఒక్కొక్కరికి 4000 రూపాయల పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్లు పంపిణీ చేయడానికి నిర్ణయం తీసుకుంది. భర్త మరణించినట్లయితే భార్యకు పింఛన్ అందించే ఈ పథకం కింద 71,380 మందికి రూ. 4 వేల చొప్పున పింఛన్ అందించనున్నారు.

అర్హులైన వారి దరఖాస్తులను పరిశీలించి తిరస్కరించిన వాటికి గల కారణాలను అధికారులు స్పష్టం చేశారు. కాగా అర్హులైన వారి పింఛన్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ కానున్నాయి. అర్హులైన వారికి ఒక్కొక్కరికి రూ. 4వేల పింఛన్ పొందుతారు. దీంతో మహిళలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. తిరస్కరించిన వారు మరోసారి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తామని స్పష్టం చేశారు.