ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. డెహ్రాడూన్ నుంచి కేదార్నాథ్ వెళ్తుండగా గుప్తకాశీ సమీపంలోని గౌరీకుండ్ అడవుల్లో హెలికాప్టర్ కుప్పకూలింది. ప్రమాద సమయంలో హెలికాప్టర్ లో 6 గురు ప్రయాణికులతో పాటు పైలట్ ఉన్నట్లు సమాచారం.

సంఘటనాస్థలం వద్ద సహాయక చర్యలు చేపట్టారు. ఇక ఈ హెలికాప్టర్ లో ఉన్న 6 గురు ప్రయాణికులు మృతి చెందారని అంటున్నారు.