తెలంగాణలోని రైతులకు శుభవార్త అందజేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇవాళ్టి రైతు భరోసా డబ్బులను రైతుల అకౌంట్లోకి జమ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. , సన్నాలకు బోనస్ డబ్బులు కూడా త్వరలోనే రిలీజ్ చేస్తామన్నారు. కొత్తగా పాస్ బుక్ వచ్చిన వాళ్ళ రైతు భరోసా డబ్బులను ఈ నెల చివరకు విడుదల చేస్తామన్నారు.
ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలలోకి తీసుకు వెళ్లాల్సిన బాధ్యత స్థానిక నేతలదేనని అన్నారు. స్థానిక ఎన్నికలకు 15 రోజుల గడువు మాత్రమే ఉందని కావున శ్రేణులు సిద్ధంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. మరోవైపు ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఉన్న అభ్యర్థులను ఎంపిక చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.