ఏసీబీ ముందుకు మరోసారి కేటీఆర్ వెళ్లనున్నారు. నేడు ఫార్ములా ఈ-కార్ కేసులో కేటీఆర్ను విచారించనున్నారు ఏసీబీ అధికారులు. ఫార్ములా ఈ-కార్ రేసుకు సంబంధించి గతేడాది డిసెంబర్ 19న కేసు నమోదు చేసింది ఏసీబీ. హెచ్ఎండీఏ నుంచి ఎఫ్ఈఓకు రూ.50 కోట్లకుపైగా నిధులు మళ్లించడంపై ఏసీబీ దృష్టి పెట్టింది.

ఇప్పటికే ఈ కేసులో సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిని విచారించింది ఏసీబీ. ఇక నేడు ఫార్ములా ఈ-కార్ కేసులో కేటీఆర్ను విచారించనున్నారు ఏసీబీ అధికారులు. కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరు కానుండడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో టెన్షన్ మొదలైంది.