కుప్పం ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్

-

కుప్పం ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయింది. మహిళను కట్టేసి దాడి చేసిన వారిపై కఠిన చర్యలకు ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు నాయుడు. ఈ ఘటనపై ఇప్పటికే జిల్లా ఎస్పీతో మాట్లాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇటువంటివి పునరావృతం కాకుండా చూడాలని పోలీసులకు చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు.

kuppam
kuppam

కాగా చిత్తూరు జిల్లా కుప్పంలో దారుణం జరిగింది. నారాయణపురంలో అప్పు తీర్చలేదని మహిళను చెట్టుకు కట్టేసాడు వడ్డీ వ్యాపారి. మునికన్నప్ప వద్ద రూ.80 వేలు అప్పు చేసాడు శిరీష భర్త తిమ్మరాయప్ప. అయితే ఆ అప్పు తీర్చలేక భార్య, బిడ్డలను వదిలేసి వెళ్ళాడు తిమ్మరాయప్ప. దీంతో అప్పు తీర్చాలంటూ శిరీషకు వేధింపులు మొదలయ్యాయి.

కూలీ పని చేస్తూ అప్పు కడుతోంది శిరీష. ఇక టైమ్ కి డబ్బులు చెల్లించడం లేదని శిరీషను బూతులతో దూషిస్తూ చెట్టుకు కట్టేసాడు వడ్డీ వ్యాపారి. ఇక ఈ ఘటనపై వెంటనే స్పందించి మునికన్నప్పను అరెస్టు చేశారు పోలీసులు. మునికన్నప్ప టీడీపీ కార్యకర్త అని అంటున్నారు. ఈడ్చుకొంటూ వెళ్ళి తాడుతో బలవంతంగా వేప చెట్టుకు శిరీషను కట్టేసిన కొట్టాడని టీడీపీ కార్యకర్త మునికన్నప్పపై వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news