పిఎఫ్ డబ్బులను వెంటనే తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ కొత్త నిర్ణయాలతో సులభంగా విత్ డ్రా చేసుకోండి..!

-

కేంద్ర ప్రభుత్వం ఎన్నో నిర్ణయాలను తీసుకుంటూ ఉంటుంది. అయితే, ప్రైవేట్ ఉద్యోగుల పీఎఫ్ డబ్బుల కోసం కూడా తాజాగా ఒక కొత్త నిర్ణయాన్ని తీసుకువచ్చింది. ప్రైవేట్ ఉద్యోగులకు సంబంధించిన పీఎఫ్ డబ్బులను ను బయటకు తీసుకోవడానికి సులభమైన మార్గాన్ని తీసుకువచ్చింది. ఇదివరకు అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేట్ సంస్థల ఉద్యోగుల్లో ఉద్యోగులు పీఎఫ్ డబ్బులను తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడేవారు. విత్‌ డ్రా చేసుకోవడం ఎంతో కష్టం కావడం వలన, ఏటీఎం ద్వారా పీఎఫ్ డబ్బులను బయటకు తీసుకునే మార్గాన్ని తీసుకురావడం జరిగింది.

ప్రైవేట్ ఉద్యోగులు ఈపీఎఫ్ ను విరమించుకోవడానికి ఎన్నో నిబంధనలు ఉన్నాయి. అయితే, కొన్ని విప్లవాత్మకమైన నిర్ణయాలను తీసుకువచ్చిందని ప్రభుత్వం తెలియజేసింది. పీఎఫ్‌ను విత్‌ డ్రా చేసుకోవడానికి ఆన్‌లైన్ పీఎఫ్ఓ పోర్టల్‌ ను ఉపయోగించవచ్చు. అయితే దానికి పాన్ కార్డు, ఆధార్ కార్డు వివరాలు లింక్ చేసి ఉంటే సరిపోతుంది. అంతేకాకుండా, ఏటీఎం ద్వారా పీఎఫ్ డబ్బులను తీసుకోవడానికి కొత్త సదుపాయాన్ని త్వరలో తీసుకురానుంది అని ప్రభుత్వం తెలియజేసింది. ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్‌ గా ఉండే వారు బ్యాంకింగ్ కార్డు ద్వారా నిధులను తీసుకోవచ్చు. కేవలం ఏటీఎం పిన్‌ ను ఉపయోగించి పీఎఫ్ అకౌంట్‌ లో కొంత డబ్బులను విత్‌ డ్రా చేసుకోవచ్చు.

ఈ విధంగా ఈపీఎఫ్ఓ ద్వారా డబ్బులను విత్‌ డ్రా చేసుకోవడానికి రూ.1,00,000 వరకు పరిమితి ఉంటుంది. ఒకవేళ ఆన్‌లైన్‌ లో ఈపీఎఫ్ఓ పోర్టల్‌కు సంబంధించి అవగాహన లేకపోతే, సమీపంలోని ఈపీఎఫ్ కార్యాలయానికి వెళ్లి కాంపోజిట్ క్లెయిమ్ ఫారమ్‌ ను తీసుకొని ఆధార్ కార్డు లింక్ చేసుకోవాలి. ఆధార్ కార్డు లింక్ చేయకపోతే, దీనికి సంబంధించిన వివరాలను పేర్కొని ఫారమ్‌ ను సబ్మిట్ చేయాలి. ఈ విధంగా లింక్ చేసుకోవడం వలన పీఎఫ్‌ను విత్‌ డ్రా చేసుకోవడం సులభం అవుతుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news