తెలంగాణా రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. తల తాకట్టు పెటైనా సరే రానున్న రోజుల్లో 20 లక్షల ఇండ్లు నిర్మించి పేదలకు ఇస్తామని వెల్లడించారు. అవి ఇచ్చిన తరువాతే 2028 అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు అడుగుతామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.

అసంతృప్తిగా ఉన్న 69 వేల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్లు రాకపోతే… లబ్ధిదారులకు 5 లక్షల రూపాయలు ఇస్తామని తాజాగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. 5 లక్షల రూపాయలతో వారి నిర్మాణం పూర్తి చేసుకోవాలని… ఆ దిశగా అడుగులు వేస్తున్నామని స్పష్టం చేశారు. సొంత స్థలం లేని అర్హత కలిగిన లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయిస్తామని కూడా వివరించారు. మూడు సంవత్సరాలలో మొత్తం 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తామని కీలక ప్రకటన చేశారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
తల తాకట్టు పెటైనా సరే రానున్న రోజుల్లో 20 లక్షల ఇండ్లు నిర్మించి పేదలకు ఇస్తాం..
అవి ఇచిన తరువాతే 2028 అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు అడుగుతాం: మంత్రి పొంగులేటి
అంటే ఒక్కో ఇంటికి ఇప్పుడు మీరు ఇచ్చే రూ. 5,00,000 వేసుకున్నా.. 1 లక్ష కోట్ల రూపాయలు కావాలి కదా సార్.. ఈ మూడేళ్లలోనే అదెలా… pic.twitter.com/1kQu0YMH36
— Telugu Reporter (@TeluguReporter_) June 23, 2025