బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకు ఊహించని షాక్ తగిలింది. సాయంత్రంలోగా చంపేస్తామంటూ ఎంపీ రఘునందన్ రావుకు మావోయిస్టుల నుంచి బెదిరింపు కాల్ వచ్చింది. దింతో మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలో ఓ కార్యక్రమంలో ఉండగా కాల్ రావడంతో డీజీపీ, మెదక్ ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు ఎంపీ రఘునందన్ రావు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన తర్వాత మావోయిస్టుల నుంచి బీజేపీ ఎంపీకి బెదిరింపు కాల్ రావడం గమనార్హం. 2026 మార్చి 31 నాటికి దేశాన్ని నక్సల్స్ రహితం దేశంగా తీర్చిదిద్దుతామని, ఈ వర్షాకాలంలో మావోయిస్టులకు నిద్రలేకుండా చేస్తామని పేర్కొన్నారు అమిత్ షా. ఈ తరుణంలోనే సాయంత్రంలోగా చంపేస్తామంటూ ఎంపీ రఘునందన్ రావుకు మావోయిస్టుల నుంచి బెదిరింపు కాల్ వచ్చింది.