పిల్లలు ఏకాగ్రతతో చదువుకోవాలంటే.. ఈ మార్పులను చేయాల్సిందే..!

-

వాస్తు నియమాలను పాటించడం వలన ఎంతో ఉపయోగం ఉంటుంది. ముఖ్యంగా వాస్తు శాస్త్రంలో చెప్పిన చిట్కాలను పాటించడం వలన ఎంతో ఆనందంగా ఉండవచ్చు. ముఖ్యంగా ఇంట్లో పిల్లల కోసం కూడా వాస్తు నియమాలను పాటించవచ్చు. పిల్లలు జాగ్రత్తగా చదువుకోవాలి, ఎటువంటి నెగటివ్ ఎనర్జీ ఇంట్లో ఉండకూడదు అంటే కచ్చితంగా వాస్తు శాస్త్రంలో చెప్పిన నియమాలను పాటించాలి. వాటిని పాటించడం వలన స్టడీ రూమ్‌లో ఎంతో ప్రశాంతత ఉంటుంది మరియు ఎటువంటి ఆలోచనలు లేకుండా శ్రద్ధగా చదువుకుంటారు.

ఇంట్లో స్టడీ రూమ్‌ను నిర్మించే ముందు కొన్ని మార్పులను చేసుకోవడం వలన ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం రాదు. ఎప్పుడూ కూడా స్టడీ రూమ్‌లో వెలుతురు ఎక్కువ ఉండే విధంగా చూసుకోవాలి మరియు స్టడీ రూమ్‌ను తూర్పు, ఉత్తర లేదా పడమర దిశలో పెట్టడం వలన పిల్లలకు ఎంతో అనుకూలంగా ఉంటుంది మరియు వారి మనసులో స్థిరత్వం ఏర్పడుతుంది. ఈ విధంగా ఎంతో బాగా చదువుకుంటారు. అయితే స్టడీ రూమ్‌లో ఉండే తలుపులు ఉత్తర, తూర్పు, పడమర, ఈశాన్య దిశల్లో ఉండవచ్చని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా చదువుకునే దిశ కూడా ఎంతో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు.

ముఖాన్ని తూర్పు లేదా ఉత్తర దిశలో పెట్టి కూర్చొని చదవడం వలన ఎంతో ప్రయోజనం ఉంటుంది. అంతేకాకుండా పిల్లలకు సంబంధించిన పుస్తకాలను నైరుతి, వాయువు దిశలో పెట్టడం వలన సరైన విధంగా చదవలేరు. కనుక తూర్పు, ఉత్తర దిశల్లో మాత్రమే పుస్తకాలకు సంబంధించిన షెల్ఫ్ ను ఏర్పాటు చేయండి. వాస్తు శాస్త్రంలో చెప్పిన ఈ నియమాలను పాటించడం వలన పిల్లలు ఎంతో శ్రద్ధగా చదువుతారు మరియు ఎటువంటి ఆలోచనలు లేకుండా ఏకాగ్రతతో ఉంటారు. కనుక ఈ మార్పులను స్టడీ రూమ్‌లో తప్పకుండా చేయండి.

Read more RELATED
Recommended to you

Latest news