నేటి నుంచే తెలంగాణ బోనాలు… సీఎం రేవంత్ రెడ్డి కీల ప్రకటన

-

తెలంగాణ రాష్ట్రంలో ఇవాల్టి నుంచి బోనాల పండుగ ప్రారంభం కానుంది. హైదరాబాద్ గోల్కొండ లోని జగదాంబిక ఆలయంలో బోనం సమర్పించడంతో ఈ బోనాల పండుగ ప్రారంభమవుతుంది. ఆషాడ మాసంలో అమావాస్య వచ్చిన తర్వాత వచ్చే తొలి గురు లేదా ఆదివారం బోనాలు ప్రారంభించడం చాలా రోజులుగా వస్తున్న ఆనవాయితీ.

Bonalu in Telangana from the 26th of this month
Bonalu in Telangana from the 26th of this month

ఈ నెల ఎటు చూసినా డబ్బుల చెప్పులు అలాగే పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక జూన్ 29వ తేదీన రెండవ పూజ నిర్వహిస్తారు. జూన్ 3, 10,13, 17, 20,24 తేదీలలో తదుపరి పూజలు నిర్వహిస్తారు. ఇక ఆషాడ మాస బోనాలు ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని పేర్కొన్నారు. గోల్కొండ జగదాంబకి ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news