విద్యార్థులకు అలర్ట్… నేటి నుంచి ఇంజినీరింగ్ తొలి విడత కౌన్సెలింగ్

-

తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఇవాల్టి నుంచి తెలంగాణ ఇంజనీరింగ్ తొలి విడత కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది. తెలంగాణ ఎంసెట్ 2025 లో ర్యాంకు సాధించిన వారికి ఇవాల్టి నుంచి మొదటి విడత… బీటెక్ సీట్ల కౌన్సిలింగ్ ప్రారంభమవుతుంది. జూలై 7వ తేదీ వరకు ఈ కౌన్సిలింగ్ కొనసాగనుంది.

Engineering first phase counseling from today
Engineering first phase counseling from today

ఈ సారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాన్ లోకల్ కోటా తొలగించడంతో ఆ సీట్లు కూడా… స్థానికులకే దక్కబోతున్నాయి. ఎస్సీ వర్గీకరణ, దివ్యాంగులకు ఐదు శాతం కోట అమలు చేయబోతున్నారు. జులై ఒకటో తేదీ నుంచి జూలై 8వ తేదీ వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది. జులై 18వ తేదీన సీట్ల కేటాయింపు కూడా చేయనుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక రెండో విడత కౌన్సిలింగ్ జూలై 25వ తేదీ వరకు కొనసాగును. ఆగస్టు 5వ తేదీ వరకు చివరి దశ అంటే మూడవ విడత కౌన్సిలింగ్ ఉండనుంది.

Read more RELATED
Recommended to you

Latest news