తెలంగాణ ప్రజలకు శుభవార్త.. వచ్చే వారంలోనే వారి ఖాతాలలో రూ. 6 వేలు!

-

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. వచ్చే వారంలోనే వారి ఖాతాలలో 6000 రూపాయలు వేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పెండింగ్ నిధులను జూలై మొదటి వారంలో విడుదల చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.

revanth reddy
revanth reddy

ఈ పథకం కింద భూములేని వ్యవసాయ కూలీలకు ఏటా రెండు విడతలలో 12 వేల రూపాయలు అందిస్తోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. తొలి విడతలో ఇప్పటికే 83,87 మందికి 6000 రూపాయల చొప్పున జమ చేసింది. మిగిలిన నాలుగు లక్షల 45 వేల 34 మందికి 261 కోట్లు రిలీజ్ చేయబోతోంది. ఉపాధి హామీ జాబు కార్డు కలిగి ఉండి అలాగే కనీసం 20 రోజులు పని దినాలు పూర్తిచేసిన వారు.. ఈ పథకానికి అర్హులైన సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి నేపథ్యంలో పెండింగ్ నిధులను జూలై మొదటి వారంలో రిలీజ్ చేయబోతుంది తెలంగాణ ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Latest news