రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్… కేవలం 3 రోజులే

-

రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్. రేషన్ కార్డు ఉన్నవారు ఈనెల 30 సోమవారం లోపు మూడు నెలల సన్నబియ్యాన్ని తీసుకునే అవకాశం ఉందంటూ జిల్లా పౌరసరాఫరాల శాఖ అధికారులు సూచనలు చేశారు. కాగా, ఈ విషయం మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల అయింది. ఇప్పటివరకు ఎవరైనా రేషన్ బియ్యాన్ని తీసుకోకపోతే సమీపంలోని డీలర్ల వద్ద రేషన్ తీసుకోవాలని చెప్పారు.

ration
District Civil Supplies Department officials have advised that those with ration cards will have the opportunity to receive three months of rice by Monday, the 30th of this month.

తీసుకున్న బియ్యాన్ని అమ్మినట్లయితే కార్డును రద్దు చేసే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. జూలై 1 నుంచి ఎలాంటి పంపిణీ ఉండదని స్పష్టం చేశారు. కాగా ఇప్పటికే చాలామంది మూడు నెలల సన్న బియ్యాన్ని తీసుకున్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత సన్న బియ్యం ఇవ్వడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news