రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్. రేషన్ కార్డు ఉన్నవారు ఈనెల 30 సోమవారం లోపు మూడు నెలల సన్నబియ్యాన్ని తీసుకునే అవకాశం ఉందంటూ జిల్లా పౌరసరాఫరాల శాఖ అధికారులు సూచనలు చేశారు. కాగా, ఈ విషయం మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల అయింది. ఇప్పటివరకు ఎవరైనా రేషన్ బియ్యాన్ని తీసుకోకపోతే సమీపంలోని డీలర్ల వద్ద రేషన్ తీసుకోవాలని చెప్పారు.

తీసుకున్న బియ్యాన్ని అమ్మినట్లయితే కార్డును రద్దు చేసే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. జూలై 1 నుంచి ఎలాంటి పంపిణీ ఉండదని స్పష్టం చేశారు. కాగా ఇప్పటికే చాలామంది మూడు నెలల సన్న బియ్యాన్ని తీసుకున్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత సన్న బియ్యం ఇవ్వడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.