నా గుండెల్లో నాలుగు బుల్లెట్లు ఉన్నాయి… చావుకు భయపడే వ్యక్తిని కాదు అని పేర్కొన్నారు కొండా మురళి. తన వ్యాఖ్యలపై పలువురు చేసిన ఫిర్యాదుల పట్ల పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి వివరణ ఇచ్చినట్లుగా కొండా మురళి వెల్లడించారు. కాంగ్రెస్ నేతలు అంటే తనకు చాలా గౌరవం ఉందని అన్నారు. కొందరు నేతలపై వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకోవద్దని కొండా మురళి అన్నారు.
కార్యకర్తలను పట్టించుకోవాలని మాత్రమే కోరానని చెప్పారు. రేవంత్ రెడ్డి మళ్ళీ సీఎం కావాలి. బీసీలకు మేలు జరగాలని 40ఏళ్లుగా పోరాటం చేస్తున్నాను. రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనే తపన మా అందరిలో ఉందని కొండా మురళి అన్నారు. ప్రస్తుతం కొండా మురళి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.