konda murali comments on warangal politics: వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. కొండా ఫ్యామిలీ వర్సెస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 16 ఎకరాల అమ్మి 70 కోట్లు ఖర్చుపెట్టినట్లు గుర్తు చేశారు. ఈ నేపథ్యంలోనే కొండా సురేఖ గెలిచిందని వెల్లడించారు.

తనకి ఇంకా 500 ఎకరాల భూమి ఉందని… మీ దగ్గర నుంచి ఒక్క పైసా కూడా నాకు వద్దు అని వెల్లడించారు. అన్నా రాజకీయ జీవితంలో ఉన్నత వర్గాలతోనే పోటీ అంటూ పేర్కొన్నారు. నేను ఎవరిని ఇబ్బంది పెట్టలేదు… ఎవరికి భయపడను అంటూ కొండా మురళి స్టేట్మెంట్ ఇచ్చారు.