తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాలు సందర్భంగా ఈ నెల 21న అంటే సోమవారం రోజున పబ్లిక్ హాలిడే ప్రకటించారు. ఎల్లుండి రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలతో పాటుగా ప్రభుత్వ కార్యాలయాలకు కూడా సెలవు ఉండబోతోంది. హైదరాబాద్, సికింద్రాబాద్ లాంటి జంట నగరాలలో సోమవారం లిక్కర్ షాపులు కూడా మూసివేస్తున్నారు. రేపు ఆదివారం కావడంతో వరుసగా రెండు రోజులు హాలిడే వచ్చింది.

ఇప్పటికే గత కొన్ని రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగ అత్యంత వైభవంగా జరుగుతోంది. ప్రతి ఒక్కరూ అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. అమ్మవారి మీద భక్తితో కట్నాలు, కానుకలు సమర్పించారు. కేవలం ఈ సెలవు తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఉంటుంది. ఏపీలో సెలవు లేదు. ఏపీలో విద్యాసంస్థలు, ఆఫీసులు యధావిధిగా నడుస్తాయి.