తిరుమల శ్రీ వారి భక్తులకు బిగ్ అలెర్ట్. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమల శ్రీ వారి దర్శనం కోసం 12 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో స్వామివారి సర్వ దర్శనానికి 12 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు.

కాగా ఆదివారం శ్రీవారిని 85,486 మంది భక్తులు దర్శించుకున్నారు. 30,929 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ.3.85 కోట్లుగా ఉందని టీటీడీ అధికారులు వెల్లడించారు.