కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం ఉండనుంది. ఇవాళ మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం ఉండనుంది. ఎలక్షన్ కమిషన్ పై రాహుల్ గాంధీ చేసిన విమర్శలపై స్పందించనుంది ఈసీ. బీహార్ తో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ఎన్నికల సంఘం అక్రమంగా ఓట్లు తొలగించిందని ఆరోపించారు రాహుల్ గాంధీ.

ఈ తరుణంలోనే రాహుల్ గాంధీ చేసిన విమర్శలపై స్పందించనుంది ఈసీ. ఇక నేటి నుంచి రాహుల్ గాంధీ ఓటర్ అధికార్ యాత్ర ప్రారంభం కానుంది. 16 రోజుల్లో 1300 కిలోమీటర్ల యాత్ర నిర్వహించనున్న రాహుల్ గాంధీ… ఓట్ల చోరీపై 20కి పైగా జిల్లాల్లో రాహుల్ యాత్ర ఉంటుంది. ఇవాళ బిహార్ లోని ససారాంలో ప్రారంభమై, సెప్టెంబర్ 1న పాట్నాలో జరిగే భారీ ర్యాలీతో ఓటర్ అధికార్ యాత్ర ముగియనుంది. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తో సహా యాత్రలో పాల్గొననున్నారు ఇండియా కూటమి నేతలు.