నేడు, రేపు పులివెందులలోనే జగన్ పర్యటన కొనసాగనుంది. ఇవాళ వైఎస్ఆర్ వర్థంతి కార్యక్రమంలో పాల్గొనున్నారు జగన్. నేడు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్బంగా.. ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద మాజీ సీఎం వైఎస్ జగన్ తో పాటు వైఎస్ షర్మిల ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొననున్నారు.

ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు భాకరాపేటలోని క్యాంప్ కార్యాలయానికి వైఎస్ జగన్ చేరుకుంటారు. ఇక రేపు ఉదయం 7.15 గంటలకు ఇడుపులపాయకు చేరుకుని వైఎస్ఆర్ ఘాట్ వద్ద తండ్రికి నివాళులర్పించనున్నారు జగన్. ఆ తర్వాత లింగాల మండలం అంబకపల్లిలో గంగమ్మ కుంట వద్ద జల హారతి కార్యక్రమంలో పాల్గొననున్నారు వైఎస్ జగన్. ఈ మేరకు షెడ్యూల్ ఫిక్స్ అయింది.