‘ది కేరళ స్టోరీ’ ఓటీటీ విడుదల ఆలస్యం.. అందుకే : అదా శర్మ

-

ఎన్నో వివాదాల మధ్య విడుదలైన ది కేరళ స్టోరీ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ సినిమా స్టార్ హీరోల మూవీస్​తో పోటీ పడి మరీ కలెక్షన్లు సాధించింది. ఇక విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది. అయితే చిత్రం రిలీజ్ అయి 50 రోజులు దాటినా.. ఇంకా ఈ మూవీ ఓటీటీ రిలీజ్​పై క్లారిటీ రాలేదు. తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదలపై నటి అదా శర్మ స్పందించింది.

‘‘మా సినిమా థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా 50 రోజులు పూర్తి చేసుకుంది. థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిన తర్వాతనే ఓటీటీలో ప్రసారం చేస్తారు. నాకు తెలిసిన సమాచారం ప్రకారం.. ఏ ఓటీటీ సంస్థకు ఇవ్వాలా అని నిర్మాతలు ఆలోచిస్తున్నారు. అందుకే దీని ఓటీటీ విడుదల ఆలస్యమవుతోంది’’ అని అదా శర్మ చెప్పుకొచ్చింది.

ఈ సినిమా మంచి విజయం సాధించడం చూసి కొంతమంది కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని చిత్ర దర్శకుడు సుదీప్తో సేన్‌ ఇటీవల వ్యాఖ్యానించారు. ఏదైనా ప్రధాన సంస్థ నుంచి మంచి ఆఫర్‌ వస్తుందేమోనని ఎదురుచూస్తున్నామని ఓటీటీ రిలీజ్ గురించి చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news