ఓటీటీలోకి ‘ఆదిపురుష్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

-

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో ఓం రౌత్ తెరకెక్కించిన సినిమా ఆదిపురుష్. ఎన్నో వివాదాలు, ట్రోలింగ్​లను ఎదుర్కొంటున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మాత్రం కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే రోజురోజుకి కలెక్షన్లు తగ్గిపోతున్నాయి. సినిమా థియేట్రికల్‌ రన్‌ ముగింపునకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరో వారం పాటు ‘ఆదిపురుష్‌’  సినిమా ఓటీటీ విడుదలపై ప్రస్తుతం చర్చ నడుస్తోంది.

‘ఆదిపురుష్‌’ మూవీ ఓటీటీలో ఎప్పుడు వస్తుందా? అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో సోషల్‌మీడియా వేదికగా ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో దక్కించుకున్న సంగతి తెలిసిందే. జులై 15, 16 తేదీల్లో ‘అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్స్‌’ ఉన్నాయి. ఈ సందర్భంగా ‘ఆదిపురుష్‌’ను స్ట్రీమింగ్‌కు తీసుకురానున్నట్లు టాక్‌. దీనిపై అటు చిత్ర బృందం, ఇటు ఓటీటీ సంస్థ అధికారిక ప్రకటన వెలువరించాల్సి ఉంది. ఈ చిత్రంలో రాఘవుడిగా ప్రభాస్‌ నటించగా, జానకిగా కృతిసనన్‌ నటించారు. రావణుడిగా లంకేశ్‌పాత్రలో సైఫ్‌ అలీఖాన్‌ కనిపించారు.

Read more RELATED
Recommended to you

Latest news