తెలుగు ఆడియన్స్‌తో కలిసి ‘కల్కి’ చూడాలనుంది: అమితాబ్‌ బచ్చన్‌

-

నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. అయితే ఈ సినిమాలో అశ్వత్థామ పాత్రలో నటించి మెప్పించిన బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులతో కలిసి చూడాలని ఉందన్నారు. నాగ్ అశ్విన్ను స్పెషల్గా ఇంటర్వ్యూ చేసిన బిగ్బీ ఈ మేరకు మాట్లాడారు.

‘‘కల్కి’లో చేసినందుకు వస్తోన్న ప్రశంసలు నా నటనకు అనుకోవడం లేదు. ఆ పాత్ర, కాన్సెప్ట్‌కు వస్తున్నాయి. ‘కల్కి’లో దీపికా పదుకొణె పాత్ర అద్భుతం. ఈ ఐడియా వచ్చినందుకు మిమ్మల్ని (నాగ్‌ అశ్విన్‌) ప్రశంసించాలి. ఆమె నిప్పుల్లో నడుచుకుంటే వచ్చే సన్నివేశం హైలైట్‌. కానీ అందులో తనకేం కాకుండా చూపించారు. ఈ విషయంపై నేను ప్రేక్షకుల అభిప్రాయాలు తెలుసుకోవాలి. సినిమా ఎలా ఉందని వాళ్లను అడిగి కనుక్కోవాలి. హైదరాబాద్‌లో ఉన్న తెలుగు ప్రేక్షకుల మధ్య కూర్చొని సినిమా చూడాలి. ఎందుకంటే వాళ్లు సినిమాను బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు’ అని అమితాబ్‌ బచ్చన్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news