స్టేజ్ పైనే కన్నీరు పెట్టుకున్న అనసూయ.. ఏమైందంటే..?

-

యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. స్టేజ్ ఎక్కిందంటే చాలు నవ్వులు పువ్వులు పూయిస్తూ.. చలాకీగా మాట్లాడుతూ.. అందర్నీ అలరిస్తూ ఉంటుంది. అలాంటిది ఆమె ఈరోజు ఒక్కసారిగా తన బాధను తట్టుకోలేక కంటతడి పెట్టేసింది. అయితే ఆ కంటతడికి కారణం క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్శకత్వంలో రూపొందిన రంగమార్తాండ సినిమా అని చెప్పాలి. ఈ సినిమాలో ఆమె కీలకమైన పాత్రలో నటించారు. ప్రకాష్ రాజ్ కు కోడలిగా ఆమె కనిపించనున్నారు. ఉగాది సందర్భంగా ఈరోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ నేపథ్యంలోనే నిన్న హైదరాబాదులో రంగమార్తాండ టీం ప్రెస్ మీట్ నిర్వహించగా.. అందులో కృష్ణవంశీ, బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్, ఆదర్శ బాలకృష్ణ, అనసూయ తదితరులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ.. కృష్ణవంశీ వైపు తిరిగి ఆయనకు రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టి.. కన్నీరు పెట్టుకుంది.. నాకు చాలా ఎమోషనల్ గా ఉంది.. మళ్లీ యాక్ట్ చేస్తున్నానని అంటారు అని అనసూయ ఏడ్చేశారు. భావోద్వేగంతో వచ్చిన కన్నీళ్లు .. వణుకుతున్న గొంతుతోనే అనసూయ మాట్లాడారు.

రంగమార్తాండ సినిమాలో నేను ఉన్నాను.. నా జీవితానికి ఇది చాలు.. మొన్న రాత్రి నేను ఈ సినిమాను ఫస్ట్ టైం చూసాను.. నా డబ్బింగ్ వరకు మాత్రమే సినిమా గురించి నాకు తెలుసు.. కానీ సినిమా మొత్తం ఎప్పుడు చూద్దామని ఎదురు చూశాను..ఇక ఈ సినిమా చూసి తట్టుకోలేకపోయాను. ఆ బాధ ఇప్పటికీ ఉంది.. సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు చాలా ధైర్యంగా పొగరుగా వెళ్లి కూర్చున్నాను. కానీ ఒక సినిమా లవర్ గా నేను ఏడుపు ఆపుకోలేకపోయాను అంటూ అనసూయ చెప్పుకొచ్చారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version