ఆ సమయంలో ప్రభుత్వాలు మాకు సహకరించలేదు : బాలకృష్ణ

-

నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ఆదివారం రోజున వరంగల్​లో అట్టహాసంగా జరిగింది. బాలకృష్ణ హీరోగా అనిల్‌ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కాజల్‌ కథానాయికగా నటిస్తుండగా.. శ్రీలీల కీలక పాత్ర పోషించింది. ఈ సినిమా ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో వరంగల్‌లోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీలో ఈవెంట్‌ నిర్వహించారు.

ఈ ఈవెంట్​లో మాట్లాడిన బాలకృష్ణ.. తాను హీరోగా నటించిన ‘అఖండ’ సినిమా విడుదల విషయంలో ప్రభుత్వాలు సహకరించలేదని అన్నారు. సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా అనే మీమాంసలో చిత్ర పరిశ్రమ ఉన్న సమయంలో ‘అఖండ’ను విడుదల చేశామని చెప్పారు. ఆ సమయంలో ప్రభుత్వాలు తమకు సహకరించలేదని.. అదనపు షోలు లేవని, టికెట్‌ రేట్లు పెంచలేదని చెప్పారు. ప్రేక్షకులు తరలి రావడంతో.. ఆ సినిమా రికార్డు సృష్టించిందని వెల్లడించారు. పారిశ్రామిక రంగాన్ని ఎలా గుర్తిస్తారో చిత్ర పరిశ్రమను ప్రభుత్వాలు అలాగే గుర్తించాలని.. అప్పుడే ప్రభుత్వాలకు మంచి ఆదాయం వస్తుంది అని బాలయ్య బాబు అభిప్రాయపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version